KTR: కేసీఆర్ స్థాయికి కాంగ్ర్స్లో ఎవరూ సరిపోరు

KTR: చిట్చాట్లో మాజీమంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో భారీ స్కామ్కు తెర లేసింది అన్నారు. టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్లు కొల్లగొట్టేందుకు.. సీఎం రేవంత్ టీమ్ సిద్ధమవుతోందన ఆరోపించారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఈ నెల 17 నుంచి 25లోపు మళ్లీ తనకు నోటీసులు ఇస్తారని అరెస్ట్, జైలు అంటూ ప్రచారం చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి ఒక్క అభ్యర్థినే నిలబెట్టామని చెప్పుకోచ్చారు కేటీఆర్. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే తాము బేరసారాలకు తావు లేకుండా ఒక్కరినే నిలబెట్టామన్నారు.
అనంతరం రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులు ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారని, అందుకే ఢిల్లీలో రేవంత్ మాటకు విలువ లేకుండా పోయిందని కేటీఆర్ వివరించారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ చెప్పారు.
గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారని తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసీఆర్ వస్తారన్నారు. అయితే అసెంబ్లీలో కాంగ్రెస్ పిచ్చి మాటలు వినడానికి కేసీఆర్ రావొద్దు అనేది కొడుకుగా నా అభిప్రాయమన్నారు. కేసీఆర్ స్థాయికి కాంగ్ర్స్లో ఎవరూ సరిపోరని తెలిపారు.