తెలంగాణ
Hyderabad: దారుణం.. విద్యార్ధులు బొట్టు పెట్టుకుని వచ్చారంటూ చితకబాదిన ప్రిన్సిపల్

హైదరాబాద్ పెద్దఅంబర్ పేట్ లో దారుణం చోటు చేసుకుంది. కండర్ షైన్ స్కూల్ ప్రిన్సిపల్ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు బొట్టు పెట్టుకుని వచ్చారు అని ప్రిన్సిపల్ చితకబాదారు. అంతేకాదు బలవంతంగా వాష్ రూంలోకి తీసుకెళి బొట్టు తీయించారు ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ చర్యలపై స్కూల్ లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.