తెలంగాణ
Vikarabad: విషాదం.. ఉరివేసుకుని తల్లి కొడుకు ఆత్మహత్య

Vikarabad: వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బషీరాబాద్ మండలంలోని కాశీంపూర్ గ్రామంలో తల్లీ కొడుకులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే. చుట్టుపక్కల వాళ్లు కోడలి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో హత్యా ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
మొగులప్ప వృత్తిరిత్యా గ్రామపంచాయతీ కార్మికుడు తల్లి ఎల్లమ్మ ఇంట్లోనే ఉంటుంది. ఇటీవల ఇంట్లో గొడవల కారణంగా మొగులప్ప భార్య రేణుక భర్త వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ ఘటన జరగడంతో పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.