తెలంగాణ
Harish Rao: తెలంగాణ సర్కార్ మొద్దు నిద్ర పోతోంది

Harish Rao: ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్రావు. కృష్ణా, గోదావరి జలాలను ఏపీ తరలించుకుపోతున్నా సర్కార్ మొద్దు నిద్ర పోతోందని హరీశ్ రావు ఆరోపించారు. మాట్లాడితే వికారమైన భాషతో విపక్షాలపై ఎగిరిపడటం కాదని ఏపీ ప్రభుత్వం, కేంద్రం మీద ఎగిరిపడాలని రేవంత్కు హితవు పలికారు హరీశ్ రావు.
తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఏపీ వాటా 512 టీఎంసీలు కానీ ఇప్పటికే 657 టీఎంసీలు తీసుకుపోయిందని హరీశ్రావు తెలిపారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు హరీశ్ రావు. రాష్ట్ర హక్కులను ఏపీకి తాకట్టు పెట్టడానికా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నదని ప్రశ్నించారు హరీశ్రావు.