ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: వైసీపీ హయాంలో అన్నీ అరాచకాలే

Nara Lokesh: వైసీపీ పాలనలో అనేక అరాచకాలు జరిగియాన్నారు మంత్రి నారా లోకేష్. వైసీపీ హయాంలో ప్రతిపక్ష నేతను ఇంటి నుండి బయటకు రాకుండా బంధించారని గుర్తు చేశారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడి చేసి కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఆరోజుల్లోనే 19 బహిరంగ సభల్లో ప్రజలందరికీ రెడ్ బుక్ చూపించానని లోకేష్ తెలిపారు.
గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని ఓ దళితుడిని కిడ్నాప్ చేయించి కేసులు విత్ డ్రా చేయించారన్నారు. అటువంటి వారిప్పుడు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని లోకేష్ చెప్పుకొచ్చారు. వాస్తవాలు అన్ని బయటకు వస్తాయన్న లోకేష్ చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.