సినిమా
Manchu Manoj: రంగారెడ్డి కలెక్టర్ను కలిసిన మంచు మనోజ్

Manchu Manoj: రంగారెడ్డి కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ను నటుడు మంచు మనోజ్ కలిశారు. ఇటీవల చోటు చేసుకున్న పలు విషయాల గురించి చర్చించారు. తన ఆస్తుల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని కోరుతూ మోహన్బాబు.. జిల్లా మేజిస్ట్రేట్ను ఆశ్రయించారు. జల్పల్లిలోని తన నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని.. ఆయన ఫిర్యాదులో తెలిపారు.
తాను కొంతకాలంగా తిరుపతిలోనే ఉంటున్నానని తెలిపారు. అనంతరం ఆ నివాసంలో ఉంటున్న మనోజ్కు కలెక్టర్ నోటీసులు పంపించారు. ఈ క్రమంలోనే వివరణ ఇచ్చేందుకు మనోజ్ తాజాగా అడిషనల్ కలెక్టర్ను కలిసినట్లు తెలుస్తోంది.