తెలంగాణ
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025.. ప్రత్యక్ష ప్రసారం

Telangana Rising Global Summit 2025: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. సదస్సును రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రముఖ సినీ నటుడు నాగార్జున, వివిధ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్న ఈ సదస్సు సోమ, మంగళవారాల్లో కొనసాగనుంది. మొత్తం 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఈ గ్లోబల్ సమ్మిట్కు హాజరయ్యారు.



