తెలంగాణ

MLC Kavitha: నేను చెప్పిన విషయం అవాస్తవం అయితే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా

MLC Kavitha: కాంగ్రెస్, బీజేపీ అడుగడుగునా బీసీలకు అన్యాయం చేశాయని, ఈ రెండు జాతీయ పార్టీలు బీసీలకు చేసిన ద్రోహంపై తాను చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటి అవాస్తవం అని తేల్చినా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చాలెంజ్ చేశారు. దేశంలో బీసీలకు ఎవరైనా న్యాయం చేశారా అంటే ఇది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమేనన్నారు. ఇందిరాపార్క్‌లో నిర్వహించిన బీసీ మహాసభలో పాల్గొన్న కవిత.. రాబోయే జనాభా గణనలో కులగణన చేయాలని బీజేపీని డిమాండ్ చేస్తున్నానన్నారు.

42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కర్ణాటక, బిహార్, మహారాష్ట్ర ఫెయిల్యూర్ స్టోరీ తెలియకుండానే హామీ ఇచ్చారా అని ప్రశ్నించారు. బీసీల లెక్కలపై ఒక కమిషన్ వేస్తే మరో కమిషన్ రిపోర్టు ఇస్తుందని, ఇది రేపు కోర్టుల్లో నిలుస్తుందా అని అన్నారు. ఈ కుట్రపై కాంగ్రెస్ జవాబు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button