లక్కీ భామగా మారిన కర్లీ బ్యూటీ!

Anupama Parameswaran: ఈ ఏడాది అనుపమ పరమేశ్వరన్ సందడి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అరడజను చిత్రాల్లో నటించి నాలుగు సూపర్ హిట్లు అందుకుంది. ముగ్గురు ఫ్లాప్ హీరోలకు హిట్ ఇచ్చి లక్కీ భామగా ఎదిగింది. బెల్లంకొండ, ధ్రువ్, షరీఫ్లకు విజయం తెచ్చింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది అద్భుత ప్రదర్శన చేస్తోంది. పది నెలల్లో అరడజను చిత్రాలతో సందడి సృష్టించింది. అందులో నాలుగు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఉమెన్ సెంట్రిక్ సినిమాలు ఇమేజ్కు ఢోకా ఇచ్చాయి కానీ మిగతావి బ్లాస్టర్లుగా మారాయి. ముగ్గురు ఫ్లాప్ హీరోలకు హిట్ ఇచ్చి లక్కీ భామగా అవతరించింది. మొదటిది బెల్లంకొండ సాయి శ్రీనివాస్.
రాక్షసుడు తర్వాత అతడి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కిష్కిందపురితో అనుపమ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించింది. రెండవది ధ్రువ్ విక్రమ్. బైసన్ అతడి తొలి హిట్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా తమిళంలో రూ.55 కోట్లు వసూలు చేసింది. అలాగే ధ్రువ్తో లవ్ ట్రాక్ రూమర్ కూడా ప్లస్ అయింది. మూడవది మలయాళ చిత్రం పెట్ డిటెక్టివ్. కేరళలో ఈ సినిమా రూ.20 కోట్లు రాబట్టింది. దీనితో షరీఫ్ హీరో, నిర్మాతగా సక్సెస్ కొట్టాడు. ఇలా అనుపమ ముగ్గురికీ లేడీ లక్ అయింది.



