సినిమా

ట్రోల్స్‌కు అభిషేక్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌!

Abhishek Bachchan : సోషల్‌ మీడియాలో సెలబ్రిటీలపై ట్రోలింగ్‌ సర్వసాధారణం. బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ ఇటీవల ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. దీనిపై ఆయన అవార్డులు కొనుక్కుంటారంటూ ట్రోల్స్‌ చేశారు. అయితే దీనిపై అభిషేక్‌ ఘాటుగానే స్పందించారు.

బాలీవుడ్‌లో అభిషేక్‌ బచ్చన్‌ పేరు ప్రముఖం. సుజీత్‌ సర్కార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ వాంట్‌ టు టాక్‌’ చిత్రంలో ఆయన నటనకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు దక్కింది. కానీ నెటిజన్లు దీనిపై చర్చ మొదలుపెట్టారు. అభిషేక్‌ను ట్యాగ్‌ చేస్తూ అవార్డులు కొనుక్కుంటారని, సొలో హిట్‌ లేదని, పీఆర్‌ బలంతోనే నిలబడుతున్నారని విమర్శించారు. ఆయన కంటే బాగా నటించే వారికి అవార్డులు రావడం లేదంటూ విమర్శించారు. దీనికి అభిషేక్‌ కూల్‌గా బదులిచ్చారు.

ఒక్క అవార్డు కూడా కొనలేదని, పీఆర్‌ టీమ్‌ లేదని స్పష్టం చేశారు. కష్టం, చెమట, కన్నీళ్లతో స్థానం సంపాదించానని చెప్పారు. మీ నమ్మకం నాకు తెలియదు కానీ ఇంకా కష్టపడి పని చేస్తానని, నా భవిష్యత్తు పనితీరే మీ నోర్లు మూయిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ స్పందన గౌరవభరితంగా ఉండటంతో అభిమానులు మెచ్చుకుంటున్నారు. ట్రోల్స్‌కు ఇచ్చిన రిప్లై ఆయన ప్రొఫెషనలిజాన్ని మరోసారి చాటింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button