ఆంధ్ర ప్రదేశ్
Midhun Reddy: టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిన నన్ను వేధిస్తోంది

Midhun Reddy: ఎంపీ మిథున్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన లాకప్ లో అన్ని కెమెరాలు పెట్టారని సంచలన ఆరోపణలు కూడా చేశారు. తాను జైల్లో ఏది చేసినా విజయవాడలో చూసేలా ఏర్పాట్లు చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెట్టిందని ఫైర్ అయ్యారు. వేధించడానికి తనపై కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన గౌరవ కోర్టు తనకు బెయిల్ ఇచ్చిందని గుర్తు చేశారు. నేను ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తారని గుర్తు చేశారు.



