ఆంధ్ర ప్రదేశ్
Nellore: దారుణం.. భార్యపై కత్తితో దాడి.. అడ్డొచ్చిన అత్తమామలను నరికేశాడు

Nellore: నెల్లూరు జిల్లా దుత్తలూరులో దారుణం చోటుచేసుకుంది. భార్యపై కత్తితో దాడి చేశాడు భర్త వెంగయ్య. అడ్డొచ్చిన అత్త, మామపైనా కూడా దాడికి పాల్పడ్డాడు. ఘటనలో అత్త జయమ్మ, మామ కళ్లయ్య అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న భార్య అంకమ్మ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు భార్యపై అనుమా నంతో వెంగయ్య దాడికి పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.