తెలంగాణ
Hyderabad: మెట్రో స్టేషన్ పైనుండి దూకి యువకుడి మృతి

Hyderabad: మెట్రో స్టేషన్ పైనుండి ఓ యువకుడు దూకిన ఘటన కలకలం రేగింది. హైదరాబాద్ సరూర్ నగర్లో వెలుగులోకి వచ్చింది. చికిత్స నిమిత్తం యువకుడు హర్షిత్ను వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ హర్షిత్ మృతి చెందాడు. దీంతో మృతదేహం ఉస్మానియాకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.