తెలంగాణ
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్ఐ, కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి

సూర్యాపేట జిల్లా కోదాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఎస్ఐతోపాటు ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
దుర్గాపురం స్టేజీ దగ్గర ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కోదాడ పోలీసులు.. మృతులు కోనసీమ జిల్లాకి చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.