నేడు తెలుగు రాష్ట్రాల్లో నక్సల్స్ బంద్

మావోయిస్టు నేతలు నంబాల కేశవరావు, సుధాకర్, భాస్కర్ ఎన్కౌంటర్లను నిరసిస్తూ తెలంగాణ మావోయిస్టు పార్టీ శుక్రవారం తెలుగు రాష్ట్రాల బంద్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితమే జగన్ పేరుతో ఓ లేఖ విడుదల చేసింది. ఏపీలో ఎన్కౌంటర్లో మృతి చెందిన భూపాలపల్లి జిల్లా వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఏపీలోని రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు.
గురువారం రవి మృతదేహాన్ని చూపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు గురువారం సాయంత్రం రవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చూపించి పోస్టుమార్టానికి తరలించినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం వెలిశాలలో రవి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దండకారణ్యం సరిహద్దు జిల్లాలైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు జిల్లా లోని పోలీసులు బంద్ నేపథ్యంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తూ రోడ్ల పైన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు.