రామాయణం సినిమా సంచలనం.. శూర్పణఖగా రకుల్?

Ramayana: నితేశ్ తివారీ రామాయణం సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రణ్బీర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. శూర్పణఖ పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమా కోసం అభిమానుల ఆసక్తి ఆకాశాన్ని తాకుతోంది.
బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ చిత్రం సినీ ప్రియుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, కన్నడ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడిగా, లారా దత్తా కైకేయిగా నటిస్తున్నారు. 2026 దీపావళికి మొదటి భాగం, 2027లో రెండో భాగం విడుదల కానున్నాయి.
ఇప్పుడు శూర్పణఖ పాత్ర చర్చనీయాంశంగా మారింది. మొదట ప్రియాంక చోప్రాను సంప్రదించగా, ఆమె రాజమౌళి-మహేశ్ సినిమాతో బిజీ కావడంతో రకుల్ ప్రీత్ సింగ్కు అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం రకుల్ లుక్ టెస్ట్కు సిద్ధమవుతున్నారని సమాచారం. రకుల్ ప్రస్తుతం ‘దేదే ప్యార్ దే 2’లో నటిస్తున్నారు.