KTR: సీఎం రేవంత్ రెడ్డి ఓ చిల్లర నాయకుడు

KTR: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఓ చిల్లర నాయకుడంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. రేవంత్ గురువునే కేసీఆర్ తరిమేశారు. ఇక రేవంత్ ఎంత అంటూ కౌంటర్ అటాక్ చేశారు. కేసీఆర్ ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ వాళ్లే ఏదో కుట్ర చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడ కట్టినా గొప్ప పురస్కారం దక్కేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇరిగేషన్పై కేసీఆర్కు ఉన్న అవగాహన ఎవరికీ లేదన్న కేటీఆర్, నాలుగేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి 40లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించామని గుర్తుచేశారు. పిల్లను ఇచ్చిన మామ దగ్గర రేవంత్ కూర్చుని బుద్ధి తెచ్చుకోవాలి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం విచారణ అంతా రాజకీయ కక్ష సాధింపేనన్నారు కేటీఆర్.