తెలంగాణ

Mahesh Kumar Goud: కుల గణనలో దేశానికి తెలంగాణ దిక్సూచి

Mahesh Kumar Goud: ఢిల్లీలోని ఇందిరా భవన్ ఏఐసీసీ కార్యాలయంలో బిసి కుల గణనపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఈ సమావేశంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, జాతీయ నాయకులు జైరాం రమేష్, కొప్పుల రాజు, మధు యాష్కీ పలువురు పాల్గొన్నారు.

కుల గణనలో దేశానికి తెలంగాణ దిక్సూచి అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీ కుల గణన హామీతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీ కులగణనపై అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. కులగణన విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి వర్గం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వేగవంతంగా కార్యాచరణ చేపట్టారని వెల్లడించారు టీపీసీసీ చీఫ్.

కులగణన వల్ల రాష్ట్రంలో కులాల వారీగా లెక్కలు తేలాయని దాంతో ఏ కులానికి ఎంత రిజర్వేషన్లు ఇవ్వాలో లెక్క తేలిందన్నారాయన. రాబోయే ఎన్నికలలో 42 శాతం బిసి రిజర్వేషన్లు అమలు చేయాలని కృషి చేస్తున్నామని టీపీసీసీ చీఫ్ వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button