ఆంధ్ర ప్రదేశ్
Botsa Satyanarayana: కూటమి పార్టీల మధ్య సఖ్యత లేదు

Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోపిడీ చేసే ఆలోచనే తప్ప ప్రజా సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవని ఆయన విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా స్వామ్యాన్ని అబాసూపాలు చేస్తుందన్నారు.
కూటమి పార్టీల మధ్య సంఖ్యత లేదన్నారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికకు 20 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారని అన్నారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం తరువాత మోసం చెయ్యడం బాబుకి అలవాటే అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.