ఆంధ్ర ప్రదేశ్
రన్నింగ్ లారీలో చెలరేగిన మంటలు

రన్నింగ్ లారీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో యాసిడ్ ట్యాంకర్ పూర్తిగా దగ్ధమైంది. ట్యాంకర్ ఇంజిన్ భాగంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. కర్నూలుకి తిరిగి వెళ్తుండగా ఈ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపు చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు మండ లం తుంగపాలెం సమీపంలోని ప్రధాన రహదారిపై ఘటన జరిగింది.