తెలంగాణ
KRMB: శ్రీశైలం, సాగర్ నుంచి నీటి విడుదల.. కేఆర్బీఎం నిర్ణయం

KRMB: తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై KRMB కీలక నిర్ణయం తీసుకుంది. కోటా అయిపోయిన ఏపీకి ఇంకా నీళ్లు కేటాయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఏపీకి నాలుగు టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది.
అదేవిధంగా తెలంగాణకు 10.26 టీఎంసీలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఇవి శ్రీశైలం జలాశయం నుండి తీసుకోవాలని సూచించారు. తాగునీటికి మాత్రం శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ నుంచి కేటాయించారు.