తెలంగాణ
Warangal: మిర్చి కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా.. ఒకరు మృతి.. 20 మందికి గాయాలు

Warangal: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిని నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. కూలీలు జీడిగట్టుతండా నుంచి ఇటుకలపల్లి వెళ్తుం డగా ప్రమాదం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.