జాతియం
Bihar: కారు-ట్రక్కు ఢీ.. 8 మంది మృతి

Bihar: బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రక్కు ఢీ కొన్నాయి. ప్రమాదంలో అక్కడికక్కడే ఎనిమిది మంది మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. కటిహార్ జిల్లా పోతియా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.