ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: ఏపీ సీఫుడ్ పరిశ్రమ నెట్వర్కింగ్ కి సహకారం అందించండి

Nara Lokesh: సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ భారత్లో అగ్రగామిగా నిలిచిందన్నారు మంత్రి నారా లోకేష్ . దేశం మొత్తం మీద ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీ 60శాతానికి పైగా వాటా కలిగి ఉందని తెలిపారు.
2024-25లో దాదాపు 16.98 మిలియన్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఏపీ నుంచి విదేశాలకు ఎగుమతి అయినట్లు తెలిపారు. సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్ ఏపీ సీఫుడ్ పరిశ్రమ నెట్ వర్కింగ్ కు సహకారం అందించాలని కోరారు.



