ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: పార్టీ, ప్రభుత్వం అనుసంధానంతో ముందకు వెళ్లాలి

Nara Lokesh: పార్టీ లేకపోతే మనం ఎవరం లేమని గుర్తుంచుకోవాలన్నారు మంత్రి నారా లోకేష్. తిరుపతి నియోజకవర్గ పర్యటనలో పార్టీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా.. యూనిట్, బూత్ ఇంఛార్జ్ లతో పాటు బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారెంటీ, మన టీడీపీ యాప్, సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని లోకేష్ అభినందించారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆయా సమస్యలను పరిష్కరించి అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం పార్టీని బలోపేతం చేసేందుకు సగం రోజు మీతో గడుపుతున్నాను అన్నారు. పార్టీ, ప్రభుత్వం రెండూ అనుసంధానమై ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. తనకు ఎంత పని ఒత్తిడి ఉన్నా మంగళగిరి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నా అని తెలిపారు.