ఆంధ్ర ప్రదేశ్
నన్ను కావాలనే ఇరికించారు .. విజ్జిని, పిల్లల్ని తలచుకుంటే బాధేస్తోంది .. ఎస్సై ఆడియో వైరల్

పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ ఎస్సై సత్యనారాయణమూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆయన స్నేహితునితో ఫోన్ లో మాట్లాడారు. తాజాగా ఆ ఆడియో బయటకు రావడంతో అందరూ కంటతడి పెడుతున్నారు. ఆ కాల్ లో మూర్తి సంబంధం లేని విషయంలో నన్ను కావాలనే ఇరికించి,ఆ ఇద్దరూ ఇబ్బందులు పెడుతున్నారని,విజ్జిని,పిల్లల్ని తలచుకుంటే బాధేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.