ఆంధ్ర ప్రదేశ్
మాజీ మంత్రి కాకాణి కేసులో కీలక పరిణామం

Kakani: వైసీపీ నేత, మాజీమంత్రి కాకాణి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పీటీ వారెంట్పై కాకాణిని గుంటూరుకి తరలించే అవకాశం కన్పిస్తోంది. ఫోటోల మార్ఫింగ్ కేసులో విచారించ నున్న సీఐడీ అధికారులు ఇప్పటికే కాకాణి కోసం నెల్లూరుకు చేరుకున్నారు.
అక్రమ మైనింగ్ కేసులో మాజీమంత్రి కాకాణికి మరో 14 రోజుల రిమాండ్ను విధించింది న్యాయస్థానం. కృష్ణపట్నం పోర్టు వద్ద అనధికార టోల్గేట్ ఏర్పాటుపై వసూళ్లకు పాల్పడుతున్నట్లు కాకాణిపై మరో కేసు కూడా నమోదైంది.