తెలంగాణ
Vemula Veeresham: ఎమ్మెల్యే వేముల వీరేశంపై సైబర్ దాడి కేసులో స్పీడప్

Vemula Veeresham: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సైబర్ దాడి కేసులో పోలీసులు స్పీడప్ పెంచారు. న్యూడ్ కాల్స్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూడ్ కాల్స్ చేసి వేముల వీరేశంను బ్లాక్ మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించగా మధ్యప్రదేశ్ పోలీసుల సహాయంతో నిందితులను నకిరేకల్కు తీసుకొచ్చారు పోలీసులు.
వారం రోజుల క్రితం వేముల వీరేశంకు న్యూడ్ కాల్స్తో ఎటాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ రికార్డులు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో జరిగిన సైబర్ అటాక్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.