తెలంగాణ
గద్వాల్ హత్య కేసులో వెలుగులోకొస్తున్న సంచలన విషయాలు

Gadwal Murder Case: గద్వాల్ హత్య కేసులో గంట గంటకు సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో నిందితుల స్కెచ్ బయటికొస్తుంది. ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలని బ్యాంక్ మేనేజర్, ప్రధాన సూత్రధారి తిరుమలరావు ప్లాన్ చేశాడు. ఇందుకు మొదట భార్యను చంపి తర్వాత తేజేశ్వర్ హత్యకు కుట్ర చేశారు.
భార్యను చంపితే చెడ్డ పేరు వస్తుందని తేజేశ్వర్ ను హత్య చేయించాడు. పరుశరామ్, రాజు, నగేష్ అనే నిందితులకు డబ్బు ఆశ చూపించి ఘాతుకానికి పాల్పడ్డాడు. హత్య చేసినందుకు రూ. 2లక్షలు చెల్లించాడు తిరుమలరావు. పోలీసుల అదుపులో భార్య, అత్త, ముగ్గురు నిందితుల ఉండగా తిరుమలరావు పరారీలో ఉన్నాడు.