తెలంగాణ
Raghunandan Rao: సాయంత్రంలోగా చంపేస్తాం.. ఎంపీ రఘునందన్కు బెదిరింపు కాల్

Raghunandan Rao: మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకి బెదిరింపు కాల్ వచ్చింది. సాయంత్రం వరకు చంపేస్తామంటూ అగంతకుడు హెచ్చరించాడు. తాను మావోయిస్టునని చెప్పుకున్నాడు. దమ్ముంటే రక్షించుకోవాలన్నాడు. ఇక బెదిరింపు కాల్ విషయాన్ని డీజీపీతోపాటు సంగారెడ్డి ఎస్పీకి రఘునందన్ రావు వివరించారు. మధ్యప్రదేశ్ నుండి ఫోన్ కాల్ చేసినట్లు అగంతకుడు తనతో చెప్పాడంటూ రఘునందన్ రావు వివరించారు.