ఆంధ్ర ప్రదేశ్
Ambati Rambabu: అమరావతిది అంతులేని కథ.. పోలవరానిది ముగింపు లేని కథ

Ambati Rambabu: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైరయ్యారు. పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని దాన్ని బ్యారేజికే పరిమితం చేశారంటూ అంబటి మండిపడ్డారు. అమరావతిది అంతులేని కథ పోలవరానిది ముగింపు లేని కథగా మార్చారన్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటిఎంలాగా వాడుకుంటున్నారని అన్నారు.
రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలని ఉంది. కానీ డబ్బులు కొట్టేయటానికి ఆ ప్రాజెక్టును ఏపీకి బదలాయించుకున్నారని ఆరోపించారు.



