ఆంధ్ర ప్రదేశ్
Virupakshi: చంద్రబాబు, పవన్, లోకేష్ కాలర్ పట్టుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి

Virupakshi: వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, లోకేష్ కాలర్ పట్టుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. సంక్షేమ పథకాలకు బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించారని ఆయన విమర్శించారు.
మహిళలకు ఉచిత బస్ ఎక్కడ అని ఎమ్మెల్యే విరుపాక్షి ప్రశ్నించారు. వైసీపీ శ్రేణులకు సంక్షేమ పథకాలు ఇస్తే పాముకు పాలు పోసినట్లు అని సీఎం అనడం సరికాదన్నారు. సంక్షేమం అంటే పార్టీలకు అతీతంగా అమలు చేయాలని ఎమ్మెల్యే విరుపాక్షి అన్నారు.