ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వాదశి.. భారీగా పాల్గొన్న భక్తులు

Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాని పురస్కరించుకొని.. చక్రస్నాన మహోత్సవాని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. తెల్లవారిజామున శ్రీవారి మూలవిరాట్కు ప్రాతకాల కైంకర్యాలు చేశారు. అనంతరం గర్భాలయం నుంచి శ్రీవారి సుదర్శన చక్రాన్ని.. వెలుపలకు తీసుకొచ్చి.. ఊరేగింపుగా పుష్కరిణికి తీసుకెళ్లారు.
వారహస్వామి ఆలయ ప్రాంగణంలో.. సుదర్శన చక్రానికి సుగంధపరిమళ ద్రవ్యాలతో.. అర్చకులు అభిషేకం నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛరణల నడుమ పుష్కరిణిలో చక్రాని మూడుసార్లు ముంచడంతో ద్వాదశి చక్రస్నాన ఉత్సవం ముగిసింది.