ఆంధ్ర ప్రదేశ్
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో స్మార్ట్ స్టిక్స్ వినియోగం

Tirumala: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునే విధంగా టీటీడీ కార్యాచరణ రూపొందించింది. జంతువులు, మానవుల మధ్య సంఘర్షణ వాతావరణాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక జాగ్రత్తలను టీటీడీ తీసుకుంటూ వస్తోంది. ఆధునిక పరిజ్ఞానంతో కూడుకున్న స్మార్ట్ స్టిక్స్ని అలిపిరి మెట్ల మార్గంలో వినియోగిస్తోంది టీటీడీ ఫారెస్ట్.
25స్మార్ట్ స్టిక్స్తో అలిపిరి మెట్ల మార్గంలో ఫారెస్ట్ సిబ్బంది గస్తీ కాస్తున్నారు. స్మార్ట్ స్టిక్స్లో ఎక్కువ కాంతి వచ్చేలా టార్చ్, అలారంతో పాటు క్రింద భాగంలో కరెంట్ షాక్ ఇచ్చే డివైస్ ఉండటం విశేషం. టీటీడీ అవలంభిస్తున్న విధానం ద్వారా భక్తులు నిర్భయంగా సురక్షితంగా తిరుమలకు చేరుకోవచ్చు అంటున్న టీటీడీ డిసీఎఫ్వో శ్రీనివాసులు.