ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో ఘనంగా ఉగాది వేడుకలు

Tirumala: తెలుగు నూతన సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా జరిగాయి. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని శ్రీవారికి అర్చకులు ఆరు పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం శ్రీవారి ఉగాది ఆస్థానం నిర్వహించారు. టీటీడీ ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ఆలయం లోపల చేపట్టిన అలంకరణలు, ధ్వజస్థంభాన్ని అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.