ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: వైనాట్ 175 అన్నారు..ప్రతిపక్ష హోదా కూడా లేదు

Nara Lokesh: పౌరషాల గడ్డపై కొత్త జెండా రెపరెపలాడుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్నామన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటుదెబ్బ..అని మంత్రి నారా లోకేశ్పేర్కొన్నారు. జెండా పీకేస్తామన్నారు. ఇప్పుడు వారు పార్టీ కార్యాలయాలకు తాళాలు వేసుకుని వెళ్లిపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
వైనాట్175 అన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏ తప్పు చేయని మన ప్రజానాయకుడిని బంధించారు. అప్పుడు వారి నాయకుడిని ఏకంగా తాడేపల్లి ప్యాలెస్లో ఉంచి తాళాలు వేసి బంధించారని నారా లోకేష్ అన్నారు. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవరు.. ట్రెండ్సెట్ చేస్తారు. సీబీఎన్అంటే ప్రజలందరి ధైర్యం’ అని అన్నారు.