తెలంగాణ
KTR: ప్రతి విషయం గుర్తుపెట్టుకుంటున్నా.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు

KTR: సిరిసిల్లలో టీస్టాల్ను కలెక్టర్ మూసివేయించిన ఘటనపై మాజీమంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రతీది గుర్తుపెట్టుకుంటున్నా ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు. బతుకమ్మ ఘాట్కు మార్నింగ్ వాక్ వెళ్లి అక్కడ టీస్టాల్పై ఉన్న నా ఫోటో చూసి కలెక్టర్ సహించలేక టీస్టాల్ను మూసివేయించాడని కేటీఆర్ మండిపడ్డారు.
ట్రేడ్ లైసెన్స్ లేదన్న కారణంతో టీస్టాల్ తొలగించామని మున్సిపల్ అధికారులు చెబుతుండగా టీస్టాల్లో కేటీఆర్ ఫోటో తీసేయమన్న ఆదేశాలు వినకపోవడంతోనే కలెక్టర్ అలా చేశాడని యాజమాని శ్రీనివాస్ చెబుతున్నారు. టీ స్టాల్ పోయినా సరే.. కేటీఆర్ ఫోటో తీయనని తేల్చి చెప్పడంతోనే తన టీ స్టాల్ మూసివేయించారని బాధితుడు ఆరోపిస్తున్నారు.