ఆంధ్ర ప్రదేశ్

నెట్టింట వైరల్ అవుతున్న దివ్వెల మాధురి తిరుమల రీల్స్

Divvela Madhuri : దువ్వాడ శ్రీనివాస్–దివ్వెల మాధురి జంట తరచూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. వీరిద్దరూ కలిసి కనిపించిన వీడియోలు, ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడికి వెళ్లినా, ఏదైనా మాట్లాడినా తక్షణమే నెట్టింట వైరలవుతూ ఉంటుంది. తాజాగా ఈ జంట తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ఆలయం పరిసర ప్రాంతాల్లో వీరిద్దరూ కలిసి కొన్ని రీల్స్ కూడా చేశారు.

దివ్వెల మాధురి పట్టు పరికిణీలో, లంగావోణీలో అద్భుతంగా మెరిసిపోతూ “ఎక్కడ.. ఎక్కడ.. ఉందో తారక” అనే పాటకు రీల్ చేయగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ట్రెడిషనల్ లుక్‌లో మాధురిని చూసిన నెటిజన్లు ఆమె అందాన్ని ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘స్వీట్ 16 అనిపిస్తుంది మాధురి గారు’’ అని కొందరు సరదాగా కామెంట్ చేయగా, మరికొందరు ‘‘చాలా అందంగా ఉన్నారు, ఈ డ్రెస్ లో సూపర్బ్ లుక్’’ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఈ జంట చేస్తున్న ప్రతి పోస్ట్ మీద కూడా నెటిజన్లలో ఆసక్తి పెరుగుతుండటం గమనార్హం. ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో ఉండే వీరి కంటెంట్ ఇప్పుడు తిరుమల నేపథ్యంలో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button