ఆంధ్ర ప్రదేశ్

Chandrababu: అమరావతిలో ఇంటి నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెల‌గ‌పూడి సచివాలయం వెనక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. గత ఏడాది డిసెంబరులో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5ఎకరాల విస్తీర్ణంలోని నివాస ప్లాట్‌ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేశారు.

ఇటీవలే ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయింది. దీంతో ఇంటిని 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో జీ-ప్లస్‌ 1లో నిర్మిస్తున్నారు. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు. కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాంశ్‌ పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button