ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా మారుస్తాం

Chandrababu: ఈ రోజు చరిత్రలో లిఖించ దగ్గ రోజన్నారు సీఎం చంద్రబాబు. వెలగపూడి బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ప్రయాణం మొదలైందని గుర్తు చేశారు. పదేళ్ల క్రితం మోడీ అమరావతికి శంకుస్థాపన చేశారన్నారు. ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం అమరావతి అన్నారు. అమరావతి నగరం కాదు 5 కోట్ల మంది సెంటిమెంట్ అని చెప్పుకొచ్చారు.
కాగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులు భూమి ఇచ్చారని వేల ఎకరాల్లో రైతులు భూములు ఇవ్వడం ప్రపంచంలోనే చరిత్ర అన్నారు. అయితే గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.