ఆంధ్ర ప్రదేశ్

తిరుమల అన్నప్రసాద వితరణకు నారా కుటుంబం రూ.44 లక్షల విరాళం

Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు నేపథ్యంలో తిరుమలలో పర్యటించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆ తర్వాత ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా నారా దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమల స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. తిరుమలలో ఒకరోజు అన్నప్రసాదంకు అయ్యే ఖర్చు 44 లక్షలను సీఎం చంద్రబాబునాయుడు శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు విరాళం ఇచ్చారు. ఏటా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుని అన్నదానం చేస్తున్నారు.

ఈ సందర్బంగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎమోషనల్ అయ్యారు. తాను శ్రీవారి ఆశీర్వాదంతో బతికానని చెప్పారు. ఇప్పటికి కూడా నక్సలైట్ లు దాడి చేసిన ఘటనను గుర్తు చేసుకుంటే భయమేస్తుందని అన్నారు.

కానీ స్వామి వారి ఆశీస్తులు తనమీద ఉండటంతో బతికానని భావోద్వేగానికి గురయ్యారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాం. ప్రతి పుట్టిన రోజు నాడు తిరుమలలో అన్నదానం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నామన్నారు. అన్నదానం ఒక మహత్తర కార్యక్రమమని అన్నిదానాలన కంటే అన్నదానం గొప్పదన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button