ఆంధ్ర ప్రదేశ్
Bhumana: చంద్రబాబు ఆబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు

Bhumana: హామీలు అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు వైసీపీ సీనియర్ నాయకులు భూమక కరుణాకర్ రెడ్డి. సంపద సృష్టించలేకపోతున్నా అంటూ చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవలో కోతలు పెట్టారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతి ఊసే లేదు. హామీలను గాలికి వదిలేశారు.
అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినప్పటికీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పేదలకు మంచి చేశారు కాబట్టే వైఎస్ జగన్కు 40 శాతం ఓట్లు వచ్చాయన్నారు. మంచి చేశాం కాబట్టే వైఎస్సార్సీపీ పట్ల ప్రజల్లో సానుభూతి వ్యక్తమవుతోందన్నారు. కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్న భూమన వైసీపీ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.