తెలంగాణ
Tirumala: శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ స్పీకర్. తన కుమారుడి జన్మదినం కావడంతో శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నామన్నారు. ఒంటిమిట్టలో వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయని రఘురామ కృష్ణం రాజు వెల్లడించారు. భక్తులు అందరు సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవదేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.