ఆంధ్ర ప్రదేశ్
YS Sharmila: నమ్మి అధికారమిస్తే ఘోరంగా మోసం చేశారు

YS Sharmila: కూటమి ప్రభుత్వం ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లేనని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ రిపోర్ట్ ముందుపెట్టి.. డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పారని.. పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలట అంటున్నారని అన్నారు. మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్లుంది చంద్రబాబు తీరు అంటూ సెటైర్లు వేశారు.
నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారని.. 50 లక్షల మంది అన్నదాతలను వంచించారని మండిపడ్డారు. 80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారని.. కోటిన్నర మంది మహిళలను మోసం చేశారని విమర్శించారు. 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారని కూటమిపై ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.