ఆంధ్ర ప్రదేశ్
Jagan: గుంటూరు మిర్చియార్డుకు జగన్

Jagan: కాసేపట్లో గుంటూరు మిర్చియార్డుకు జగన్ బయల్దేరనున్నారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున అనుమతి లేదంటున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే మిర్చి రైతులతో జగన్ కచ్చితంగా మాట్లాడితీరుతారంటోంది వైసీపీ క్యాడర్.
ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు జగన్ పర్యటనకు అనుమతి తీసుకోలేదంటున్న పోలీసులు ఎన్నికల కోడ్ నేపథ్యంలో జగన్ పర్యటనకు దూరంగా ఉన్నారు. మొత్తానికి జగన్ మిర్చియార్డు పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.