ఆంధ్ర ప్రదేశ్
YS Jagan: ప్లకార్డులో సినిమా డైలాగ్ రాయడం కూడా తప్పేనా

YS Jagan: నిన్నటి పర్యటనలో వివాదాస్పద ప్లకార్డుపై జగన్ స్పందించారు. చంద్రబాబు మోసం చేస్తున్నారు కాబట్టే ప్రజలు కోపం చూపిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్లకార్డులు పట్టుకోవడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి గతంలో టీడీపీ కార్యకర్త అన్నారు.
చంద్రబాబు మీద కోపంతో టీడీపీ కార్యకర్తలు కూడా మావైపు వస్తున్నారన్నారు. రప్పా రప్పా నరుకుతామనేది పుష్ప సినిమాలో డైలాగ్ అని ప్లకార్డులో సినిమా డైలాగ్ రాయడం కూడా తప్పేనా అని జగన్ ప్రశ్నించారు.