ఆంధ్ర ప్రదేశ్
YS Jagan: పథకాలు అమలుచేయకపోవడంపై జగన్ ఫైర్

YS Jagan: పేదింటి దీపాలు ఆర్పిన ఘనత కూటమి సర్కార్దేనని విమర్శిస్తూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. వైసీపీ పాలనలోని 2019-24 మధ్య ప్రతీ ఇంటికి డీబీటీ అనే ఇందనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన 30 పథకాలను పేదలకు అందకుండా వారిజీవితాల్లో దీపాలను చంద్రబాబు కూటమి సర్కార్ ఆపేసిందని జగన్ విమర్శించారు.
18 నెలల కాలంలో ఏ ఒక పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయకుండా పేదల జీవితాల్లో అంధకారం నింపారని కూటమి ప్రభుత్వంపై జగన్ ఆరోపణలు గుప్పించారు. నిరుద్యోగుల భృతి ఏమైంది? ప్రతీ అక్కాచెల్లెమ్మకు నెలకు 15వందలు, 50ఏళ్లకే పెన్షన్, నెలనెలా 4వేల పెన్షన్, ఉద్యోగులకు ఇచ్చిన పెన్షన్ ఇవన్నీ వెలగని దీపాలో, వెలగని దీపాలో, వెలిగించాం అంటే వెలిగించాం అన్నట్లు అరకొరదీపాలో తెలుపాలని జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.



