GVMCలో పట్టుకోల్పోతున్న వైసీపీ

YCP: GVMC మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే వేళ రోజురోజుకి వైసీపీ తన పట్టుకోల్పోతుంది. ఇప్పటికే 93, 94వార్డు కార్పొరేటర్ రాజీనామాతో ఢీలా పడ్డ వైసీపీ, తాజాగా ఇప్పుడు 6వ వార్డు కార్పొరేటర్ లక్ష్మీప్రియాంక రాజీనామాతో వైసీపీకి షాక్ తగిలింది. విప్ జారీ చేసే అధికారం ఉన్న ప్రియాంక రిజైన్తో వైసీపీ అయోమయంలో పడింది. అయితే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు జగన్కు లేఖ రాశారు కార్పొరేటర్ లక్ష్మిప్రియాంక.
మరికొన్ని గంటల్లో GVMC మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా కౌన్సిల్ సమావేశాన్ని సిద్ధం చేశారు అధికారులు. అదేవిధంగా జీవీఎం సీ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ సభ్యులను తప్ప బయటివారిని లోపలికి అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. మరోవైపు విదేశాల్లో ఉన్న కొంతమంది కార్పొరేటర్లు వరుసగా విశాఖకు చేరుకుంటున్నారు.