ఆంధ్ర ప్రదేశ్
చిత్తూరులో వైసీపీ నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

చిత్తూరులో వైసీపీ నాయకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నగరంలోని కొంగారెడ్డిపల్లిలో వైసీపీ నేత మురళీరెడ్డి ఇంటిపై అర్థరాత్రి దాడి చేసినట్టు స్థానికులు సమాచారం అందించారు. చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద ఉన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో వైసీపీ నాయకులు భారీ సంఖ్యలో ధర్నా నిర్వహించారు. ఘటనా స్థాలానికి చేరుకున్న వైసీపీ ఇన్చార్జ్ విజయానందరెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ దర్యాప్తు చేపట్టారు.