తెలంగాణ
Yadagirigutta: యాదగిరి గుట్టకు పోటెత్తిన భక్తులు..

Yadagirigutta: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఏకాదశి సందర్భంగా స్వామివారి ముఖమండపంలో లక్ష పుష్పార్చన నిర్వహించారు. ప్రత్యేక పూజలతో భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.